రష్మిక మందన్న- విక్కీ కౌశల్ కాంబినేషన్లో రానున్న హిస్టారికల్ మూవీ ‘ఛావా’. దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందించారు. ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్ నటించగా, శంభాజీ మహారాజ్ భార్య మహారాణి ఏసుబాయి పాత్రలో రష్మికా మందన్నా నటించారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. సుమారు 35 మిలియన్ల వ్యూస్తో నెట్టింట వైరల్ అవుతుంది.
