టాలీవుడ్ దర్శకుడు నక్కిన త్రినాథరావుకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి సూర్యారావు సోమవారం రాత్రి కన్నుమూశారు. వయోభారం కారణంగా ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సూర్యారావు భౌతికకాయాన్ని పలువురు సినీ రంగ ప్రముఖులు సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ‘మేం వయసుకు వచ్చాం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన త్రినాథరావు ఆ చిత్రంతో సూపర్హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ‘సినిమా చూపిస్తా మావ’, ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రాలతో చక్కని విజయం అందుకున్నారు. ఇటీవల రవితేజతో తీసిన ‘ధమాకా’ చిత్రం సూపర్హిట్ అయిన సంగతి తెలిసిందే!