‘హరిహర వీరమల్లు’కు తుది మెరుగులు

పవన్‌కళ్యాణ్‌ కథానాయకుడిగా, కథానాయికగా నిధి అగర్వాల్‌ నటించిన చిత్రం ‘హరిహర వీరమల్లు’ జూన్‌ 12న విడుదల చేయటానికి చిత్ర యూనిట్‌ కృషిచేస్తోంది. ఇప్పటికే ఆఖరిషెడ్యూల్‌లో మిగిలిపోయిన భాగాన్ని ఇటీవల విజయవాడ పరిసరాల్లో తెరకెక్కించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు, గ్రాఫిక్స్‌్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. ఈనెల 30న విడుదల చేయటానికి చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేసింది. అయితే అదేరోజు విజరు దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్‌’ విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నాగవంశీతోపాటుగా త్రివిక్రమ్‌ బ్యానర్‌ నిర్మించింది. కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే వంటి విషయాలు ఎలా వచ్చాయనే విషయాన్ని పరిశీలించటానికి దర్శకుడు త్రివిక్రమ్‌కు చిత్ర యూనిట్‌ బాధ్యత అప్పగించినట్లుగా సమాచారం. ఆయన ఆ పనిలో బిజీగా ఉన్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఎఎం రత్నం సమర్పణలో మెగా సూర్యప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ.దయాకరరావు నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం.

➡️