ఈడీ విచారణకు రాలేకపోతున్నా : హీరో మహేష్‌ బాబు

తెలంగాణ : సాయిసూర్య డెవలపర్స్‌, సురానా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి హీరో మహేష్‌ బాబు పోలీసుల విచారణకు రాలేకపోయారు. మూవీ షూటింగ్‌ కారణంగా … ఏప్రిల్‌ 28వ తేదీ రోజున (సోమవారం) విచారణకు హాజరు కాలేకపోతున్నానని, కొత్త తారీఖు కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి లేఖ రాశారు. సాయిసూర్య డెవలపర్స్‌, భాగ్యనగర్‌ ప్రాపర్టీస్‌ సంస్థలు వట్టినాగులపల్లిలో ప్రాపర్టీ ఎన్‌క్లేవ్‌లు ప్రారంభించాయి. వీటి కోసం కొనుగోలుదారులకు రూ.3.25 కోట్ల చొప్పున ఒప్పందాలు చేశారు. అడ్వాన్స్‌గా రూ.1.45 కోట్లు వసూలు చేసినా, ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ జరగకపోవడంతో బాధితులు ఫిర్యాదు చేశారు. సాయిసూర్య డెవలపర్స్‌, భాగ్యనగర్‌ ప్రాపర్టీస్‌ సంస్థలు అక్రమ లావాదేవీలకు సంబంధించి 100 కోట్ల రూపాయలు మోసం చేశాయని ఆరోపణలు ఉన్నాయి.

➡️