‘కాంతార 2’ షూటింగ్లో విషాదం చోటు చేసుకుంది. కేరళకు చెందిన కపిల్ (32) అనే నటుడు ఉడుపి జిల్లాలోని కొల్లూరు సమీపంలో ప్రవహించే సౌపర్ణిక నదిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ‘కాంతారా 2’ సినిమా చిత్రీకరణ ముగిసిన తర్వాత కపిల్ తన స్నేహితులతో కలిసి సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లాడు. అప్పుడు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. వెంటనే అక్కడున్న వారు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ, కపిల్ను రక్షించలేకపోయారు. ఈ సంఘటనతో కాంతారా 2 చిత్ర బృందం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ చిత్రం అక్టోబర్ 2025లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉడుపి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
