చెన్నై : సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల సినీనటి శ్రీరెడ్డిపై కేసులు నమోదైన నేపథ్యంలో ఆమె గురువారం ‘ఎక్స్’ వేదికగా మంత్రి లోకేశ్కు బహిరంగలేఖ విడుదల చేశారు. ”ప్లీజ్ అన్నా నన్ను రక్షించమని వేడుకుంటున్నాను” అని నారా లోకేష్ను శ్రీరెడ్డి కోరారు. తాను పుట్టింది గోదావరి ప్రాంతంలో అయినా.. పెరిగిందని విజయవాడలోనే అని శ్రీరెడ్డి పేర్కొన్నారు. తన స్నేహితుల్లో 75 శాతం లోకేష్ కమ్యూనిటీకి చెందినవారేనని.. ఈ విషయాన్ని తాను అనేక వీడియోల్లో కూడా చెప్పానని తెలిపారు. తన తల్లిదండ్రులకు కూడా విజయవాడతోనే ఎక్కువ అనుబంధం అని.. తమ సొంత ఇల్లు కూడా అక్కడే ఉందని చెప్పారు. అమరావతిని రాజధాని చేయడం తన తల్లిదండ్రులను సంతోషపెట్టిందని.. అందుకే వాళ్లు టీడీపీకే ఓటు వేశారని అన్నారు. ”కొన్ని విషయాల్లో ఎంత మొండిగా ఉంటారో అంత మంచి తనం కూడా మీలో ఉంది.. మీకు నాతో వీడియోలో క్షమాపణలు చెప్పించింది కూడా మా కుటుంబ సభ్యులే.. మీతో డైరెక్టుగా వీలైతే మాట్లాడమని వారు చెప్పారు.. అయితే నాకు అంత స్ధాయిలేదు.. అందుకే ఈ ఓపెన్ లెటర్ రాస్తున్నా” అని శ్రీరెడ్డి పేర్కొన్నారు. తాను టీడీపీకి, టీడీపీ కార్యకర్తలకు, అనుబంధ మీడియా సంస్థకు, జనసేనకు, జనసేన వీరమహిళలకు, వారి కుటుంబ సభ్యులకు ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పడం జరిగిందని అన్నారు. గత 10 రోజులుగా మీడియాలో వచ్చే కథనాలు, కథనాల కింద కామెంట్స్, స్పీచ్లు, చర్చలు చూసిన తర్వాత తాను ఎంతంది మనోభావాల్ని దెబ్బతిశాననేది తనకు అర్థమయ్యిందని చెప్పుకొచ్చారు. తమ కులదైవమైన వెంకటేశ్వరస్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి చెబుతున్నా.. జుగుప్సాకరంగా మట్లాడి ఇంతమంది మనోభావాలను దెబ్బతీసి తప్పు చేశానని అన్నారు. పూజలు, హౌమాలు, ప్రార్థనలు చేసే తాను ఈ పాపం ఎలా చేశాననేది అర్థం కావడం లేదని చెప్పుకొచ్చారు.
”చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, హౌం మినిస్టర్ గారికి, టీవీ 5, ఆంధ్రజ్యోతి, ఐటీడీపీకి, టీడీపీ కార్యకర్తలకు, సోషల్ మీడియాకు సారీ.. జనసేన మీడియా, 99టీవీ, ప్రైమ్ 9, వీరమహిళలు, సోషల్ మీడియాకి, పీకే గారికి నా హఅదయపూర్వక సారీ.. దయచేసి మీరందరూ పెద్ద మనసు చేసుకుని మీ తెలుగమ్మాయిని క్షమించండి” అని శ్రీరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల నుంచి జారుకోవటానికి ఈ లేఖ విడుదల చేస్తున్నానని అనుకోవద్దని కోరారు. వారం రోజులుగా మనోవ్యథకి గురై తీసుకున్న నిర్ణయం అని చెప్పారు. ”ఒక వేళ భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వచ్చినా నాబుద్ది వక్రంగా మారుతుందని అనుకోకండి.. అలా చేస్తే ప్రైవేట్ వ్యక్తులతో నన్ను ఏమైనా చేయించుకోవచ్చు. ఇకపై ఇష్టానుసారం అసభ్య భాష ఎవరిపై వాడనని ప్రమాణం చేసి చెబుతున్నాను.. నా దాకా వచ్చే సరికి నేను చేసే తప్పు ఏంటో ఇప్పుడు అర్ధం అయ్యింది. ఇప్పటికే నేను నా కుటుంబం 1000 సంవత్సరాలకు సరిపడే క్షోభ అనుభవించాం.. ఇంట్లో పెళ్లికావాల్సిన పిల్లలు ఉన్నారు.. నన్ను కొడితే ఆ దెబ్బలు ఒక నెలలో లేదా మూడు నెలల్లో మానవచ్చు.. కానీ నా వల్ల ముగ్గురికి జీవితాంతం శిక్ష వేసినదాన్ని అవుతాను. నా బాధ నా కంటే బాగా ఇంతమందిని పరిపాలించే మీకు అర్థమయ్యే ఉంటుంది.. ప్లీజ్ అన్నా మా కుటుంబాన్ని కాపాడండి. మీడియా, సోషల్ మీడియా, కేసుల నుంచి నన్ను బంధ విముక్తిరాల్ని చేయండి. సినీ పరిశ్రమలోని చిరంజీవి, నాగబాబుతో పాటు అందరికి క్షమాపణలు.. సునీత, షర్మిలను కూడా క్షమాపణలు. శ్రీ రెడ్డి సినీ పరిశ్రమలో ఫెయిల్ అయింది.. శ్రీరెడ్డి రాజకీయాల్లో ఫెయిల్ అయింది” అని శ్రీరెడ్డి పేర్కొన్నారు.