నితిన్ మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త కొంతకాలంగా వినిపిస్తోంది. తాజాగా ఆ వార్త నిజమని స్పష్టమైంది. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఎడీ’ చిత్రంతో ఈ మల్టీప్లెక్స్ అందుబాటులోకి వచ్చింది. ఏషియన్ సంస్థతో కలిసి ‘ఏషియన్ నితిన్ సితార’ అనే మల్టీప్లెక్స్ని నితిన్ ప్రారంభించారు. అయితే నితిన్కు ఇంతకుముందే సితార అనే థియేటర్ ఉంది. సంగారెడ్డిలో ఉన్న ఈ థియేటర్ను రెనోవేషన్ చేయించి ఏషియన్ సంస్థతో కలిసి సరికొత్త హంగులతో మల్టీప్లెక్స్గా మార్చారు.
