తెలంగాణ : ట్రోలర్లపై ప్రముఖ సినీనటి ఖుష్బూ తీవ్రంగా స్పందించారు. తాజాగా ఖుష్బూ తన న్యూలుక్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. తను షేర్ చేసిన ఫోటోలకు ‘బ్యాక్ టు ద ఫ్యూచర్’ అనే క్యాప్షన్ పెట్టారు. దీనిపై కొందరు ఆమె సన్నబడిన తీరును ప్రశంసిస్తుండగా, మరికొందరు నెటిజన్లు మాత్రం సన్నగా మారడానికి ఇంజెక్షన్స్ చేయించుకున్నారని, వాటి మాయ వల్లనే ఇలా మారిపోయారని, వాటి గురించి ఫాలోవర్స్కు కూడా చెప్పండి అంటూ రకరకాలుగా కామెంట్స్ పెట్టారు. ఈ కామెంట్స్పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఖుష్బూ…. వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ” మీరెటువంటి మనుషులు ? మీరెప్పుడూ మీ ముఖాలను సోషల్ మీడియాలో పంచుకోరు. ఎందుకంటే మీరు అంత అసహ్యంగా ఉంటారు. మీ తల్లిదండ్రులను చూస్తుంటే జాలి వేస్తోంది ” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
What a pain people like you are. You guys never show your faces becoz you know you are ugly from within. I pity your parents. https://t.co/IB0RMRatxl
— KhushbuSundar (@khushsundar) April 15, 2025