ప్రదీప్‌ రంగనాథన్‌ ‘డ్యూడ్‌’

May 10,2025 23:03 #telugu movies

తమిళ హీరో ప్రదీప్‌ రంగనాథన్‌, మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న పాన్‌ ఇండియా మూవీలో హీరోగా చేస్తున్నారు. ఈ సినిమాతో కీర్తిస్వరన్‌ డైరెక్టర్‌గా డెబ్యూ చేయబోతున్నారు. ‘ప్రేమలు’ స్టార్‌ మమితా బైజు ఈ సినిమాలో హీరోయిన్‌గా కనిపించనున్నారు. సీనియర్‌ నటుడు శరత్‌ కుమార్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. శనివారం ఈ చిత్ర టైటిల్‌ని చిత్రబృందం షేర్‌ చేసింది. రిలీజ్‌ డేట్‌ గురించి కూడా ప్రకటించారు. ‘డ్యూడ్‌’ అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 2025 దీపావళి సీజన్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్‌ కాబోతోంది.

➡️