పహల్గాం ఉగ్ర దాడిని ఖండించిన ప్రకాష్‌రాజ్‌

న్యూఢిల్లీ  :   పహల్గాం దాడిని ఖండిస్తున్నామని,  రక్తం మరిగిపోతుందని  సినీనటుడు ప్రకాష్‌రాజ్‌ పేర్కొన్నారు. ఈ ఘటనతో ప్రతి కాశ్మీరీ గుండె ముక్కలైందని, మాటలు రావడం లేదన్నారు. కాశ్మీరీలు మౌనం వీడాల్సిన సమయమిదని, ఈ క్రూరమైన చర్యను ఖండించాల్సిందేనని ఎక్స్‌లో గురువారం  పేర్కొన్నారు.

”ఈ అనాగరిక దాడి అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు, కాశ్మీర్‌పై దాడి. శతాబ్దాల సంప్రదాయాలకు జరిగిన అవమానం. మన విశ్వాసాన్ని దెబ్బతీసేలా దుష్ట ప్రయోజనాల కోసం చేసిన దారుణచర్య.  ఈ దుశ్చర్యకు మా రక్తం మరిగిపోతోంది. ఇలాంటివి జరిగిన ప్రతిసారీ, చేయని పనికి అవమాన భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ విషయంలో మరోసారి నిస్సందేహంగా చెబుతున్నా. దీనిని అస్సలు క్షమించం.. ఇది నిజంగా భయంకరమైన చర్య. అంతకుమించి పిరికిపంద చర్య.  మన ఇంటికి వచ్చిన అతిధులపై జరిగిన ఈ క్రూర చర్యకు నిజంగా సిగ్గుపడుతున్నాం. దయచేసి మమ్మల్ని ఈ దృష్టి నుండి  మాత్రం చూడొద్దని వేడుకుంటున్నా. ఇది నిజమైన కాశ్మీరీలు చేసింది కాదు. మా తల్లిదండ్రులు హంతకులను పెంచి పోషించలేదు. ఇది సిగ్గుపడాల్సిన అంశం. మీరు ఏం ఆశించి ఇటువంటి దారుణ హింసకు పాల్పడ్డారో తెలియదు. మీ చర్య కొన్ని కుటుంబాలను నాశనం చేసింది. పిల్లలను అనాథలుగా మార్చింది. కాశ్మీర్‌ ఆట స్థలం కాదు. యుద్ధం క్షేత్రం అంతకన్నా కాదు. అతిథులకు స్వాగతం పలికే ప్రదేశం. మీరు కశ్మీర్‌లో ప్రశాంతంగా ఉండటానికి వచ్చారు. కానీ, మేము మిమ్మల్ని కాపాడలేకపోయాం. అందుకు క్షమించమని అడుగుతున్నాం” అని పోస్ట్‌లో పేర్కొన్నారు.

➡️