టాలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాత జవాజి వెంకట రామారావు (68) (అలియాస్ తేనెటీగ రామారావు) ఆదివారంనాడు హైదరా బాద్లో తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా ఆయన కాలేయ సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 1990లో నరేష్, రాజేంద్రప్రసాద్ తదితర కథానాయకులతో ఆయన ఎక్కువగా సినిమాలు తీశారు. రాజేంద్రప్రసాద్తో తేనెటీగ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆయనను అదే పేరుతో పిలుస్తారు. వంశీ దర్శకత్వంలో నరేష్-వాణీవిశ్వనాథ్లతో ప్రేమ అండ్ కో, శివకృష్ణతో బొబ్బిలి వేట, బడి వంటి సినిమాలను నిర్మించారు. కొన్ని డబ్బింగ్ చిత్రాలను కూడా ఆయన తెలుగులో విడుదల చేశారు. రామారావు మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న పలువురు సినీ రంగ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
