పీ మహేశ్ బాబు దర్శకత్వంలో రామ్ నటిస్తోన్న తాజా చిత్రం ‘రాపో 22’. మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్య శ్రీ బోర్సే ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న తఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ‘మీకు సుపరిచితుడు.. మీలో ఒకడిని పరిచయం చేస్తామ’ని మేకర్స్ గతంలో ప్రకటించారు. తాజాగా రామ్ పాత్రను పరిచయం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫర్ మధు నీలకందన్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. నేషనల్ అవార్డు విన్నింగ్ టెక్నీషియన్ అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా వర్క్ చేస్తున్నారు.