‘గతంలో నేను నటించిన అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. ‘శుభం’ సినిమాను కూడా అదేరీతిన ఆదరించాలని కోరుతున్నా. గతం నుంచి నాకొక సెంటిమెంట్ ఉంది. నేను నటించిన సినిమా కోసం వైజాగ్ వచ్చి వెళ్తే బ్లాక్బస్టర్ అవ్వాల్సిందే. ఎందుకంటే గతంలో ఓ మజిలీ, ఓ బేబీ, రంగస్థలం సినిమాల్లాగానే నాకు మళ్లీ బ్లాక్ బస్టర్ ఇస్తారని అనుకుంటున్నా. సినిమా ఇండిస్టీలో కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలనేదే నా లక్ష్యం. భవిష్యత్తులో అందరినీ ఆకట్టుకునే కథలను మీ ముందుకు తీసుకురావాలని ఆశిస్తున్నా. మీ ప్రేమ నాకు మరింత కావాలి. ‘శుభం’ సినిమాను బ్లాక్బస్టర్ హిట్గా నిలపి నన్ను దీవించండి’ అని టాలీవుడ్ కథానాయిక సమంత కోరారు. ఆమె నిర్మాతగా నిర్మించిన చిత్రం ‘శుభం’ ఈనెల 9న విడుదల కానుంది. ఇటీవల విశాఖలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. చిత్ర యూనిట్తో కలిసి ఆమె సందడి చేశారు. స్టేజ్మీద డ్యాన్స్లతో అదరగొట్టారు. ఈ చిత్రంలో హర్షిత్రెడ్డి, సి.మల్గిరెడ్డి, శ్రియకొంఠం, చరణ్ పెరి, షాలినీ కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి ప్రధాన పాత్రల్లో నటించారు. బండి మూవీ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖతో తనకున్న అనుబంధాన్ని సమంత గుర్తుచేసుకున్నారు. అభిమానులతో ఉత్సాహంగా సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత హైదరాబాద్లో జరిగిన ప్రచార కార్యక్రమాల్లోనూ ఆమె ఉత్సాహంగా పాల్గొన్నారు.
