సంధ్య థియేటర్ ఘటనపై ఇప్పటికే డీసీపీ మాట్లాడుతూ.. ‘సంధ్య థియేటర్ మూసివేతకు సిఫార్సు చేశాం. టిక్కెట్స్ తనిఖీల కోసం ప్రేక్షకులను ఒక్కసారిగా అనుమతించారు. థియేటర్ లోపల తొక్కిసలాటతో ఊపిరాడక అవస్థలు పడ్డారు. థియేటర్లో రేవతి, ఆమె కుమారుడు స్పృహ కోల్పోయారు. రేవతి చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారని చెప్పారు. మతురాలి భర్త ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్, సెక్యూరిటీ సిబ్బందిపై కేసులు నమోదు చేశాం. ముందస్తు చర్యల్లో భాగంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం. బెన్ఫిట్ షోకి అల్లు అర్జున్ వస్తున్న విషయం మాకు చెప్పలేదు. థియేటర్ యాజమాన్యం టిక్కెట్స్ అమ్మకాలు, తనిఖీలో నిర్లక్ష్యం వహించింద’ని పేర్కొన్నారు.