‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ టీజర్‌ విడుదల

దీక్షిత్‌శెట్టి, రష్మిక మందన్నా జోడీగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’. నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌, మాస్‌ మూవీ మేకర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ తీస్తున్న ఈ సినిమా ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ. టీజర్‌ను విజరు దేవరకొండ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘టీజర్‌లోని ప్రతి విజువల్‌ ఆకట్టుకుంది. ఈ మూవీని చూసేందుకు వేచి చూస్తున్నా. ఎనిమిదేళ్లక్రితం రశ్మికను సెట్‌లో కలిశా. నేడు ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తున్నా ఆమె వ్యక్తిగతంగా ఇప్పటికే అంతే హుందాగా పనిచేస్తున్నారు. నటిగా ఆమెకు ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ మరింత బాధ్యతను ఇచ్చింది. సక్సెస్‌ఫుల్‌గా ఆ బాధ్యత వహిస్తుందని ఆశిస్తున్నా. ప్రతి ప్రేక్షకుడిని కదిలించే మంచి కథను ఈ సినిమాతో డైరెక్టర్‌ రాహుల్‌ చూపిస్తాడని నమ్ముతున్నా’ అన్నారు. విజరుదేవరకొండ వాయిస్‌ ఓవర్‌తో ఈ టీజర్‌ కొనసాగింది. ‘నీకని మనసుని రాసిచ్చేసా…పడ్డానేమో ప్రేమలో బహుశా’ అని విజరు దేవరకొండ చెబుతుండగా..స్క్రీన్‌పై రష్మిక కనిపిస్తారు. ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుంది.

➡️