తెలంగాణ : బ్యాంకు వివరాలు కూడా ఇచ్చామన్నారు. అధికారులు తనను బ్యాంక్కు తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేయించారని, బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసి చూపించినట్లు నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని చెప్పారు. బుధవారం ఉదయం టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీనిపై ఆయన భార్య తేజస్విని స్పందించారు. సినిమా నిర్మాణాలకు సంబంధించి తమ ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. సోదాల్లో భాగంగా ఐటీ అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, ఇతర రికార్డులను వారికి అందజేశామన్నారు. అలాగే బ్యాంకు వివరాలు కూడా ఇచ్చామన్నారు. అధికారులు తనను బ్యాంక్కు తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేయించారని, బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసి చూపించినట్లు తేజస్విని చెప్పారు. దిల్రాజు ఇండ్లు, ఆఫీసులతో పాటు ఆయన సోదరుడు శిరీష్, కూతురు హన్షిత రెడ్డి ఇళ్లలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయం, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ నివాసాలు, మ్యాంగో మీడియా సంస్థ, సత్య రంగయ్య ఫైనాన్స్, నిర్మాత అభిషేక్ అగర్వాల్తో పాటు ఇతర ఫైనాన్స్ కంపెనీలలోనూ ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఏక కాలంలో ఎనిమిది చోట్ల 65 బఅందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీలలో సోదాలు కొనసాగుతున్నాయి.
