మంగాపురం అనే గ్రామంలో రామయ్య, లచ్చవ్వ అనే దంపతులు ఉన్నారు. వారి ఒక్కగానొక్క కొడుకు రాజేష్.. ఒక్కడే కొడుకు అయినందున చాలా గారాబంగా చూసుకునేవారు. అమ్మానాన్నల అతి గారాబంతో రాజేష్ పెంకిగా తయారయ్యాడు.
ఒకరోజు రాజేష్ వాళ్ళ స్నేహితుడికి ఫోన్ ఉందని తెలిసి తనకి కూడా కావాలని మంకుపట్టు పట్టాడు. అమ్మానాన్న ఎంత చెప్పినా వినకుండా అన్నం తినడం మానేశాడు. స్కూల్కి కూడా వెళ్లనని మారాం చేశాడు. ఇంక చేసేది ఏమీ లేక ఒక ఫోన్ కొనిస్తారు. రాజేష్ చాలా సంతోషపడ్డాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఇంతకుముందులా రాజేష్ అమ్మానాన్నతో మాట్లాడడం మానేశాడు. ఫోన్తోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. అలా వద్దని ఎంత చెప్పినా వినలేదు. చదువును కూడా నిర్లక్ష్యం చేశాడు.
ఒకరోజు స్కూల్కి వెళ్లకుండా ఫోన్లోనే మునిగిపోవడంతో వాళ్ళ అమ్మ కోప్పడింది. రాజేష్ వెనుకా ముందు చూడకుండా అమ్మపై బాగా కోప్పడతాడు. నాన్న వచ్చాక అమ్మ మీద ఫిర్యాదు చేస్తాడు. పిల్లాడు ఫోనుపై చూపిస్తున్న శ్రద్ధ చదువుపై చూపించడం లేదని, ఇంతకుముందులా ఎవరితో మాట్లాడడం లేదని రామయ్య కొన్ని రోజులుగా గమనిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అమ్మ మీద ఫిర్యాదు చేసేంతలా రాజేష్ దిగజారాడని అర్థం చేసుకున్నాడు.
‘ఇప్పటికే చాలా సమయం మించిపోయింది. ఇకనైనా ఫోను నుండి రాజేష్ని దూరం చేయా లనుకున్నాడు. రాజేష్ మాట విన్నట్లుగా నటించి, లచ్చవ్వని విపరీతంగా తిట్టాడు. లచ్చవ్వ ఏడుస్తూ కూర్చొంది. అప్పుడు రామయ్య, రాజేష్ని పిలిచి, ‘చూడు నాన్నా అమ్మ ఎలా ఏడుస్తుందో! నీవల్లే నేను అమ్మని తిట్టాను. అమ్మ ఏం చేసింది? నిన్ను ఫోను చూడొద్దని చెప్పింది. అంతేకదా! నువ్వు ఫోను చూడడం వల్ల అమ్మతో సరిగ్గా మాట్లాడడం లేదు. తనతో ఇంతకుముందులా లేవు. రోజూ నాతో చెప్పి ఎంతో బాధపడుతోంది. అమ్మని ఇంతలా నువ్వు ఎందుకు బాధపెడుతున్నావు. నీకు అమ్మ కంటే ఫోనే ముఖ్యమైందా!’ అని నిదానంగా చెప్పాడు. నాన్న మాటలతో రాజేష్ తన తప్పు తెలుసుకున్నాడు. ‘ఇక నుండి నేను ఫోను చూడను నాన్న. అమ్మపై ఎప్పుడూ కోపం తెచ్చుకోను’ అని ఏడుస్తూ చెప్పాడు. కొడుకులో వచ్చిన మార్పుకు రామయ్య, లచ్చవ ఎంతో సంతోషపడ్డారు.
– చీర్నపల్లి నవిత,
8వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
జక్కాపూర్, సిద్దిపేట జిల్లా.
