కరిగే వెన్నెలను అడిగా
నా తల్లి ఎక్కడని…
అమావాసై సమాధానమిచ్చింది
వెలిగే సూర్యుడిని వేడుకొన్న
గ్రహణమై బదులిచ్చాడు
పూసే కుసుమాలను ప్రశ్నించా
వాడిన మేనుతో తలవాల్చాయి
విహరించే పక్షులను బతిమిలాడ
కనబడనంత ఎత్తుకు ఎగిరాయి
ఎగసిపడే కెరటాలతో పలికా
తీరాన్ని తాకి మరలాయి
గర్జించే మేఘాన్ని చూసా
మెరుపై మాయమయ్యింది
అమ్మకోసం ఏడుస్తున్న నాకు
ప్రకాశించే తారలు బదులిచ్చాయి
మీ అమ్మని మాలో చూసుకోమని..
– పోడేటి సమజ్ఞ,
డిగ్రీ ప్రథమ సంవత్సరం,కరీంనగర్.