Mar 17,2023 21:56
  • ముంబై సరిహద్దులకు చేరిన యాత్ర
  • సుదీర్ఘ పోరాటానికి సిద్ధమవుతున్న మహారాష్ట్ర రైతులు

ముంబయి : అకుంఠిత దీక్షతో వేలాదిమంది మహారాష్ట్ర రైతులు నిర్వహిస్తును లాంగ్‌ మార్చ్‌ ముంబయి సరిహద్దులకు చేరుకుంది. తమ పాదాలకు గాయాలవుతున్నా.. కాళ్ల నుంచి రక్తం కారుతునాు.. లెక్క చేయకుండా అనుదాతలు ఉద్యమ స్ఫూర్తితో దాదాపు 250 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చేవరకూ సుదీర్ఘ పోరాటం చేసేందుకైనా సిద్ధమని చెబుతున్నారు. ముంబయి సరిహద్దులోనివషీంద్‌ వద్ద ఉను ఈద్గా మైదాన్‌కు రైతులు చేరుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన చారిత్రాత్మక రైతు ఉద్యమం తరహాలో టెంట్లు వేస్తున్నారు. శుక్రవారానికి 10 టెంట్లు వేశారు. మరిన్ని టెంట్లను సిద్ధం చేస్తునాురు. ఈ ప్రాంతంలో సాంస్కృతిక బృందం కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తును రైతు వ్యతిరేక విధానాలను రైతు నాయకులు వివరిస్తున్నారు. యాత్రలో గిరిజన సంఘాల సభ్యులు, ఆశా కార్యకర్తలు పాల్గంటున్నారు.
పాదయాత్ర ప్రతినిధుల బృందంతో మహారాష్ట్ర మంత్రుల బృందంతోపాటు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడువీస్‌ ఇప్పటికే కొనిుసార్లు చర్చలు జరిపారు. రైతుల సంక్షేమానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చెప్పినా రైతులు విశ్వాసం వ్యక్తం చేయడం లేదు. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి కచ్చితమైన హామీ రావాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పని ప్రారంభించారని అనిపిస్తేనే మహా యాత్రను విరమిస్తామని రైతులు తేల్చిచెబుతునాురు. 2018లో లాంగ్‌ మార్చ్‌ తరువాత తమని ప్రభుత్వం ఎలా మోసం చేసిందో ఇంకా గుర్తుందని, ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రైతులు హెచ్చరిస్తున్నారు. అధికారులకుప్రభుత్వం సరైన ఆదేశాలు జారీ చేసేవరకూ ఉద్యమం కొనసాగుతుందని సిపిఎం నాయకులు, మాజీ ఎమ్మెల్యే జెపి గవిత్‌ తెలిపారు.

  • 17 డిమాండ్లతో నాసిక్‌ నుంచి యాత్ర

ఉల్లి పంటకు క్వింటాల్‌కు రూ.600 తక్షణ పరిహారం ప్రకటించాలని, అనిు రైతు రుణాలను మాఫీ చేయాలనే ప్రధాన డిమాండ్లతో సహా 17 డిమాండ్లతో నాసిక్‌లో ఈ నెల 13న ఎఐకెఎస్‌ నేతృత్వంలో పాదయాత్ర ప్రారంభమైంది. అటవీ చట్టం 2005 ప్రకారం గిరిజన రైతులకు అటవీ భూమిపై యాజమాన్య హక్కులు కల్పించాలని, 12 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 10 వేల మందికి పైగా అనుదాతలు, కార్మికులు ఇందులో భాగస్వామ్యమయ్యారు. ముంబయి అసెంబ్లీ వద్దకు చేరుకోవాలని వీరి ప్రణాళిక.