న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యతలు మెరుగుపడ్డాయి. శనివారం ఉదయం 9 గంటల సమయంలో 222 స్థాయిలో ఎక్యూఐ నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. అయితే ఢిల్లీలో ఈరోజు 7.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ కాలంలో సగటు ఉష్ణోగ్రతల కంటే మూడు డిగ్రీల తక్కువ అని.. చలి తీవ్రత ఎక్కువగా ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.