శాన్ప్రాన్సిస్కో : ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు చెందిన వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్ స్కైప్ సేవలు సోమవారం నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. జూమ్ మీటింగ్స్, వాట్సప్ కాల్స్ రాకముందు దేశ, విదేశాల్లోని వారు ఆన్లైన్ సమావేశాలకు స్పైప్ను ఉపయోగించేవారు. 2003లో స్కైప్ టెక్నాలజీస్ దీన్ని ప్రారంభించగా.. 2011లో మైక్రోసాఫ్ట్ స్వాధీనం చేసుకుంది. 2008లో రికార్డ్ స్థాయిలో 40 కోట్ల మంది యూజర్లుండగా.. క్రమంగా వినియోగదారులను కోల్పోయింది. ఇప్పటికీ ఆ సంస్థకు 2.3 కోట్ల మంది వినియోగదారులున్నారు. ముఖ్యంగా కోవిడ్ కాలంలో జూమ్, వాట్సాప్లకు పోటీనివ్వలేకపోయింది. మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా టీమ్స్కు ఇచ్చిన ప్రాధాన్యత స్వైప్కు ఇవ్వకపోడంతోనూ ప్రభావం కోల్పోయింది.
