ప్రియమైన చిన్నారులూ,
వేసవి సెలవుల సందర్భంగా ‘ప్రజాశక్తి’ స్నేహ అనుబంధాన్ని మీ కోసం ఒక ప్రత్యేక సంచికగా తేవాలని నిర్ణయించాం. పిల్లల సంతోషమే మా సంతోషం.
ఇందులో మీరు రాసే రచనలకు, గీసే బొమ్మలకు ప్రాధాన్యం ఇచ్చి, ప్రచురిస్తాం. కథలు, కవితలు, బొమ్మలు, పుస్తక సమీక్షలు.. ఇలా అన్ని రచనా ప్రక్రియల్లోనూ మీ సృజనకు ఈ సంచికలో చోటిచ్చాం. మీరు రాసిన కథ, కవిత కనువిందు చేసే బొమ్మలూ! వేసవిలో మీరు సందర్శించిన ప్రదేశాలు,
మీరు చదివిన పుస్తకాలపై సమీక్షలు అన్నీ ప్రచురిస్తున్నాం!! ఈ సంచికలో ప్రచురితం కాని రచనలు తర్వాత సంచికల్లో ప్రచురిస్తాం..
ముందుగానే చెప్పినట్లు మూఢ నమ్మకాలను, అతీత శక్తులను బలపరిచే రచనలను ప్రచురించడం లేదు.
ప్రజల ఐక్యత, సమానత్వం, మత సామరస్యం అంశాలపై శాస్త్రీయ దృక్పథంతో కూడిన మీ కథలు, గేయాలు, చిత్రాలు పంపండి.
ఇంకా పెద్ద పెద్ద రచయితలు / రచయిత్రులు కూడా చక్కని కథలు రాస్తారు. గొప్ప గొప్ప చిత్రకారులు బొమ్మలు గీశారు. అవన్నీ మీ కోసమే!
గిరిధర్ అంకుల్ మనందరి కోసం అందమైన కవర్పేజీ తయారుచేస్తున్నారు.
జూన్ 15వ తేదీన వచ్చే ఈ సంచిక మీకొక గొప్ప కానుకే కాదు; చక్కని జ్ఞాపకం కూడా అవుతుంది. మీరంతా పదిలంగా దాచుకునేలా ఈ బాలల ప్రత్యేక సంచికను రూపొందిద్దాం. దీనికి మీ అందరి సహాయం, భాగస్వామ్యం అందించాలి.
ఎందుకంటే- ఈ సంచిక మీదే! దీని రూపకర్తలూ మీరే! మరి ఇంకెందుకు, ఆలస్యం? మీ కాపీల కోసం.. కావాల్సినవారు
9490099422 లో సంప్రదించండి.
మీ రచనలకు చివరి తేది మే 31, 2025
చిరునామా
పాఠకులు తమ అభిప్రాయాలను మెయిల్ ద్వారా
[email protected]
పోస్టు ద్వారా అయితే స్నేహడెస్క్, ప్రజాశక్తి భవనం,
డోర్ నెం:12-402/1/1, అమరారెడ్డి కాలనీ,
అరవింద హైస్కూలు దగ్గర, కుంచనపల్లి, తాడేపల్లి,
గుంటూరు జిల్లా -522501. ఫోన్ నెం :9490099006.
– సంపాదకులు