న్యూఢిల్లీ : పారిస్ ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు అదరగొట్టి కాంస్య పతకం సాధించి 40 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన సంగతి విదితమే. శనివారం ఉదయం భారత హాకీ జట్టు పారిస్ నుంచి స్వదేశానికి చేరుకుంది. న్యూఢిల్లీలో అడుగిడిన భారత హాకీ టీంకు విమానాశ్రయంలో అధికారులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
