వాషింగ్టన్ : క్రీడల్లో మాదకద్రవ్యాల వినియోగంపై సల్పే పోరాటాన్ని ప్రోత్సహించే, సమన్వయం చేసే, పర్యవేక్షించే అంతర్జాతీయ సంస్థ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (డబ్ల్యుఎడిఎ)లో అమెరికా ప్రాతినిధ్యం రద్దయింది. 140 మందికి పైగా సభ్యులు కలిగిన ఈ సంస్థకు ఇవ్వాల్సినటువంటి కంట్రిబ్యూషన్ను అమెరికా చెల్లించకపోవడంతో ఆటోమేటిక్గా డబ్ల్యుఎడిఎ ఎగ్జిక్యూటివ్ బోర్డులో అమెరికా ప్రతినిధులు వుండేందుకు అనర్హులవుతారు. డబ్ల్యుఎడిఎ గురువారం ఈ విషయాన్ని ధృవీకరించింది.