మాడ్రిడ్‌ ఓపెన్‌ 2025 విజేతలుగా అర్యానా, కాస్పర్‌

May 5,2025 22:53 #Tennis

మాడ్రిడ్‌ ఓపెన్‌ 2025 టైటిళ్లను అర్యానా సబలెంక(బెలారస్‌), కాస్పర్‌ రూఢ్‌(నార్వే) చేజిక్కించుకున్నారు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో రూఢ్‌ 7-5, 3-6, 6-4తో 5వ సీడ్‌ డ్రాపర్‌(బ్రిటన్‌)ను, మహిళల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌సీడ్‌ అర్యానా సబలెంకా 6-3, 7-6(7-3)తో 4వ సీడ్‌ కోకా గాఫ్‌(అమెరికా)ను ఓడించారు. సబలెంక గతంలో 2023, 2021లలో చాంపియన్‌గా నిలిచింది.

➡️