సెమిస్‌లో ఓడిన అస్మిత్‌, ఉన్నతి

 తైపీ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ
తైపీ సిటీ(చైనా): తైపీ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. సెమీస్‌కు చేరి ఆశలు రేపిన యువ షట్లర్లు అస్మిత్‌ శెట్టి, ఉన్నతి హుడా ఓటమిపాలయ్యారు. తమకంటే మెరుగైన ర్యాంక్‌ ఆటగాళ్ల చేతిలో వీరిద్దరూ పోరాడి పరాజయాన్ని చవిచూశారు. శనివారం జరిగిన పురుషుల సెమీస్‌లో అస్మిత్‌ శెట్టి 18-21, 17-21తో చైనీస్‌ తైపీకి చెందిన 7వ ర్యాంకర్‌ ఛౌ-టిన్‌-చెన్‌ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఇక మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా 19-21, 11-21తో మియాజకి(జపాన్‌) చేతిలో పోరాడి ఓడింది. ముఖ్యంతి తొలి గేమ్‌లో పోటా పోటీగా సాగింది. ఆ గేమ్‌ను కోల్పోయిన ఉన్నతి.. రెండో గేమ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

➡️