క్వార్టర్స్‌కు అస్మిత్‌, ఉన్నతి

  • తైపీ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

తైపీ సిటీ(చైనా): తైపీ ఓపెన్‌ సూపర్‌-300 బ్యాడ్మింటన్‌ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లోకి యువ షట్లర్లు అస్మిత్‌ శెట్టి, ఉన్నతి హుడా దూసుకెళ్లాడు. గురువారం జరిగిన రెండోరౌండ్‌ పోటీలో అస్మిత్‌ శెట్టి 21-16, 15-21, 21-17తో భారత్‌కే చెందిన కిదాంబి శ్రీకాంత్‌పై విజయం సాధించాడు. మరో పోటీలో మన్నేపల్లి 13-21, 9-21తో ఇండోనేషియాకు చెందిన ఉబేదుల్లా చేతిలో ఓటమిపాలయ్యాడు. క్వార్టర్‌ఫైనల్లో అస్మిత్‌ శెట్టి కెనడాకు చెందిన బి.యంగ్‌తో తలపడనున్నాడు. ఇక మహిళల సింగిల్స్‌లో ఉన్నతి 21-12, 21-7తో తైపీకి చెందిన లిన్‌-ఎస్‌-వైపై సంచలన విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరింది. క్వార్టర్స్‌లో ఉన్నతి తైపీకి చెందిన హాంగ్‌ వైతో తలపడనుంది.

➡️