ఐపీఎల్ 18లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బెంగళూరు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (41), చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (34) రాణించగా, ఓపెనర్ అభిషేక్ పోరెల్ (28), ఫాఫ్ డుప్లెసిస్ (22), అక్షర్ పటేల్ (15) పరుగులు మాత్రమే చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3, హేజిల్వుడ్ 2, యశ్ దయాళ్, కృనాల్ పాండ్య చెరో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన బెంగళూరుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జాకబ్ బెతేల్ 12, వన్డౌన్ వచ్చిన పడిక్కల్ 0, రజత్ పాటిదార్ 6 స్వల్ప స్కోర్కే పెవిలియన్కు చేరారు. కృనాల్ పాండ్య (73.. 47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లు), విరాట్ కోహ్లీ (51.. 47 బంతుల్లో 4 ఫోర్లు) అర్ధశతకాలతో చెలరేగారు. దీంతో ఆర్సిబి 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీశాడు.
