డిసెంబర్ 2024 నెలలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ విజేతను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం ప్రకటించింది. భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పురుషుల విభాగంలో బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేన్ ప్యాటర్సన్లను ఓడించి బుమ్రా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకున్నాడు. ఈ అవార్డును బుమ్రా రెండోసారి గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా మొత్తం 32 వికెట్లు తీశాడు. దీంతో.. బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా ఎంపికయ్యాడు.
