అహ్మదాబాద్: గుజరాత్ టైటాన్స్కు ఊరట లభించింది. 18వ సీజన్లో ఆడేందుకు కగిసో రబడకు లైన్ క్లియర్ అయింది. దక్షిణాఫ్రికా క్రికెట్బోర్డు ‘డ్రగ్ ఫ్రీ స్పోర్ట్స్’ క్లీన్చిట్ ఇచ్చింది. రెండు సెషన్ల కౌన్సిలింగ్ పూర్తికావడంతో అతడిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. దాంతో, నిషేధం కారణంగా ఐపీఎల్కు దూరమైన రబడ త్వరలోనే గుజరాత్ జట్టుతో కలువనున్నాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ పేస్ దళం ప్రసిధ్, సిరాజ్, ఇషాంత్లతో పాటు రబడా చేరికతో మరింత పటిష్ఠంగా తయారైంది. జనవరి 21న కేప్టౌన్, డర్బన్ సూపర్ జెయింట్స్ మ్యాచ్ తర్వాత అతడికి డోప్ టెస్టు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. అతడి రక్త నమూనాల్లో నిషేధిత డ్రగ్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అయితే.. అప్పటికే ఐపీఎల్ 18వ సీజన్ కోసం రబడ భారత్కు వచ్చేశాడు. ఈ నిషేధం కారణంగా అతడు తిరిగి మళ్లీ దక్షిణాఫ్రికా వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
