తెలంగాణ : శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్లేయర్స్ గొంగడి త్రిషకు, ద్రితి కేసరిలకు ఘన స్వాగతం లభించింది. మలేషియా నుంచి బెంగళూరు మీదుగా గొంగడి త్రిష, ద్రితి కేసరి హైదరాబాద్కు చేరుకున్నారు. వీరికి హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఘన స్వాగతం పలికారు. మహిళల అండర్-19 ప్రపంచకప్లో అత్యద్భుత ప్రతిభ కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ సాధించిన గొంగడి త్రిష ఆనందం వ్యక్తం చేశారు.
