కొలంబో : ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా … భారత్తో జరుగుతోన్న మ్యాచ్లో శ్రీలంక ఆలౌటైంది. వర్షం కారణంగా ఓవర్లను 39 కి కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 38.1 ఓవర్ల వద్ద 147 పరుగులకు ఆలౌటైంది. హాసిని పెరెరా (30) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 3, నల్లపురెడ్డి చరణి 2, దీప్తి శర్మ 2 వికెట్లు తీశారు. అరుంధతీ రెడ్డి ఒక వికెట్ పడగొట్టారు.
