IPL 2025: ప్లే-ఆఫ్స్‌.. చెన్నై, రాజస్తాన్‌, సన్‌రైజర్స్‌ ఔట్‌..

  • టెబుల్‌ టాప్‌లో ఆర్‌సిబి, పంజాబ్‌, ముంబై గుజరాత్‌

ఇండియన్‌ ప్రిమియర లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-18 ఉత్కంఠభరితంగా సాగుతోంది. హోరాహోరీగా సాగుతున్న ఈ టోర్నీ ప్లే-ఆఫ్స్‌ రేసు నుంచి తొలుత చెన్నై సూపర్‌కింగ్స్‌, రాజస్తాన్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి వైదొలిగాయి. చెన్నై, సన్‌రైజర్స్‌ జట్లు ఇంకా 3 మ్యాచులు ఆడాల్సి ఉంది. రాజస్తాన్‌ 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. 49వ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో ఓటమితో ఈ సీజన్‌లో సీఎస్‌కే ఖేల్‌ ఖతమైంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి, 9 మ్యాచుల్లో ఓటమిపాలైంది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. రాజస్తాన్‌ 12 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి, 9 మ్యాచుల్లో ఓటమిపాలైంది., సన్‌రైజర్స్‌ 11 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు, ఒక మ్యాచ్‌ టైతో ఈ సీజన్‌ నుంచి వైదొలిగాయి.

ఆర్‌సిబి టాప్‌

ఆర్‌సిబి.. ఈ జట్టు ఇప్పటి దాకా ఏ ఐపిఎల్‌ ఫైనల్‌ గెలుచుకోలేదు. కానీ 2009, 2016 సంవత్సరాల మధ్యలో మూడు సార్లు రన్నరప్‌గా నిలిచింది. చెప్పుకోదగిన ఆటగాళ్ళున్నా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కప్‌ గెలవలేదు. కాగా ఈ సంవత్సరం ఆటగాళ్లందరు నిలకడగా రాణిస్తుడటం.. ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 గెలిచి 16 పాయింట్లతో 1వ స్థానంలో ఉంది.

పంజాబ్‌ కెప్టెన్‌ అదుర్స్‌

పంజాబ్‌ జట్టును కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సమర్ధవంతగా నడిపిస్తున్నాడు. 11 మ్యాచ్‌లో 7 గెలిచి, 1 మ్యాచ్‌ డ్రా చేసుకుని 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. జట్టులో ఆటగాళ్లందరు నిలకడగా రాణిస్తుండటంతో ఈ సారి జట్టు ప్లే ఆఫ్స్‌కు ఖచ్చితంగా వెళ్లే అవకాశం ఉంది.

వరుసగా ఆరో మ్యాచ్‌ల్లో ముంబయి గెలుపు

ఐదుసార్లు ఐపిఎల్‌ టైటిల్‌ విజేత ముంబయి ఇండియన్స్‌ ఈ సీజన్‌లో అంచనాలకు మించి రాణిస్తోంది. ప్రారంభంలో ఆడిన ఐదు మ్యాచుల్లో కేవలం ఒక మ్యాచ్‌లో గెలిచి నాలుగు మ్యాచుల్లో ఓడిన ముంబయి.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. కానీ ఆ తర్వాత జరిగిన ఆరు మ్యాచుల్లోనూ నెగ్గి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచి ప్లే-ఆఫ్స్‌కు చేరువైంది. 11 మ్యాచ్‌ల్లో 7 గెలిచి 14 పాయింట్లతో ఉంది.

గుజరాత్‌ రెండోసారి సాధించేనా..

గుజరాత్‌ టైటాన్స్‌ తన ఖాతాలో మరో కప్పు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ప్రస్తుతం గుజరాత్‌ టైటాన్స్‌ ఖాతాలో 14 పాయింట్స్‌తో రెండో స్థానంలో ఉంది. మరో రెండు విజయాలు సాధిస్తే.. అధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఇప్పుడు గుజరాత్‌ ఫామ్‌ చూస్తే ఇదేమంత పెద్ద కష్టం కాకపోవచ్చు. అలాగే ఈ జట్టును ంచి అత్యధిక పరుగులు సాయిసుదర్మన్‌ 504 పరుగులు, అత్యధిక వికెట్లు ప్రసిద్ధ్‌ కృష్ణ 19 వికెట్లతో టాప్‌లోఉన్నారు.

ఢిల్లీ రాణించేనా

ఐపీఎల్‌ ప్రారంభం నుండి అత్యధిక సార్లు తొలుత ఎలిమినేట్‌ అయిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్‌ ఉంది. ఈ ఫ్రాంచైజీ అత్యధికంగా మూడు సీజన్లలో అన్ని జట్లకంటే ముందే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ సారి కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ జట్టును సమర్ధవంతగా నడిపిస్తూన్నాడు. ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 గెలిచి, ఒక మ్యాచ్‌ టైతో 13 పాయిట్లతో 5వ స్థానంలో ఉంది.

కోల్‌కత్త కష్టమే…

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ భవితవ్యం తేలాలంటే మాత్రమే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. కోల్‌కతా ఆడిన 11 మ్యాచ్‌లో 5 గెలిచి, ఒక మ్యాచ్‌ను డ్రా అవ్వడంతో 11 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది.

లక్నోకు భారంగా కెప్టెన్‌ పంత్‌

లక్నో కెప్టెన్‌ పంత్‌ 18వ సీజన్‌లో నిరాశపరుస్తున్నాడు. కెప్టెన్‌గా ఫర్వాలేదనిపిస్తున్నా.. బ్యాటింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. 11 మ్యాచుల్లో 116 రన్స్‌ కొట్టాడంతే. దాంతో, అతడి ఫామ్‌ ప్రభావం లక్నో సూపర్‌ జెయింట్స్‌ను కలవరపెడుతోంది. ఈ డాషింగ్‌ బ్యాటర్‌ వైఫల్యం లక్నో ప్లే ఆఫ్స్‌ అవకాశాల్ని సంక్లిష్టం చేస్తోంది. కాగా లక్నో 11 మ్యాచులో 5 గెలిచి ఒడి 10 పాయింట్లలతో 8వ స్థానంలో ఉంది.

 

➡️