రోహన్‌ బొప్పన్నకు పద్మశ్రీ

Apr 22,2024 22:10 #bopanna, #Padma Shri award, #Sports, #Tennis
  • క్రీడారంగంలో మరో ఆరుగురికి కూడా…
  • రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం

న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన ‘పద్మ’ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా క్రీడాకారులు అందుకున్నారు. నూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం ఈ కార్యక్రమంలో వీరంతా అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. టెన్నిస్‌లో టాప్‌ర్యాంక్‌తో పాటు ట్రోఫీలు కొల్లగొడుతున్న రోహన్‌ బొప్పనతోపాటు మరో ఆరుగురి క్రీడారంగంలో పద్మ శ్రీ అవార్డు దక్కాయి.

క్రీడారంగంలో పద్మశ్రీ అవార్డు అందుకున్నవారు..
రోహన్‌ బొప్పన్న : టెన్నిస్‌
జోష్న చిన్నప్ప : స్క్వాష్‌
ఉదరు విష్ణువర్ధన్‌ : మల్లఖంబ్‌
గౌరవ్‌ ఖన్నా : బ్యాడ్మింటన్‌
సతేంద్ర సింగ్‌ లాహియ : పారా-స్విమ్మింగ్‌
పూర్ణిమ మహతో : ఆర్చరీ
హర్బిందర్‌ సింగ్‌ : హాకీ

➡️