పంజాబ్ కింగ్స్-ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య 11న జరగాల్సిన ఐపిఎల్ మ్యాచ్ వేదికను మార్చారు. షెడ్యూల్ ప్రకారం ధర్మశాలలో జరగాల్సిన ఈ మ్యాచ్ను అహ్మదాబాద్కు తరలిస్తున్నట్లు బిసిసిఐ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. లాజిస్టిక్స్ కారణాల వల్ల వేదికను మార్చినట్లు పేర్కొన్నారు. గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శి అనిల్ పటేల్ ఈ విషయాన్ని ధృవీకరించారు. బిసిసిఐ అభ్యర్ధన మేరకు ఈ మ్యాచ్ నిర్వహణకు అంగీకరించామని తెలిపారు. ఉత్తర, పశ్చిమ నగరాల్లో ఉన్న విమానాశ్రయాలను మూసివేసిన కారణంగా ఈ మ్యాచ్ను తరలించినట్లు సమాచారం.
