క్రికెట్ చరిత్రలో తొలిసారి
దుబాయ్: క్రికెట్లో ఒక ప్లేయర్ ‘రిటైర్డ్ ఔట్’ అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటిది ఏకంగా పది మంది బ్యాటర్లు ఒకేసారి ‘రిటైర్డ్ ఔట్’ కావడం ఎన్నడూ చూడలేదు. ఇదే మహిళల టి20 ప్రపంచకప్ అర్హత టోర్నీలో జరిగింది. యుఎఇ 10మంది బ్యాటర్లు ఒకేసారి ‘రిటైర్డ్ ఔట్’ రూపంలో పెవిలియన్కు చేరారు. మహిళల టి20 ప్రపంచకప్-2025 అర్హత టోర్నీలో భాగంగా బ్యాంకాక్ వేదికగా శనివారం యుఎఇ, ఖతార్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన యుఎఇ మహిళల జట్టు 16 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 192 పరుగులు చేశారు. ఈ క్రమంలో బ్యాంకాక్లో వర్షం పడే సూచనలు ఉన్న దృష్ట్యా యుఎఇ జట్టు తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయాలని నిర్ణయించుకుంది. కానీ టి20ల్లో డిక్లరేషన్ రూల్ లేకపోవడంతో, యుఎఇ మేనేజ్మెంట్ తమ బ్యాటర్లందరిని మైదానంలోకి పిలిచి ‘రిటైర్డ్ ఔట్’ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా మొత్తం పది మంది బ్యాటర్లు రిటైర్డ్ ఔటయ్యారు. భారీ ఛేదనలో ఖతార్జట్టు 11.1 ఓవర్లలో 29 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఖతార్పై 163 పరుగల తేడాతో యూఎఇ విజయం సాధించింది. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న యుఎఇ కెప్టెన్, మేనేజ్మెంట్పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
