
-ప్రస్తుత సిజె సతీష్ చంద్ర మిశ్రా ఢిల్లీ హైకోర్టుకు బదిలీ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు సిజెగా ఉన్న ఉన్న సతీష్ చంద్ర మిశ్రాను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలిజియం బదిలీలను సిఫార్సు చేసింది. ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా విపిన్ సంగి, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అంజాద్ సయీద్, రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎస్.ఎస్ షిండే, గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా రాష్మిన్ ఛాయ సుప్రీంకోర్టు కొలిజియం బదిలీలను సిఫార్సు చేసింది.