ముగ్గులు వేస్తుండగా అక్కాచెల్లెళ్లపైకి దూసుకెళ్లిన లారీ – ఒకరు మృతి

Jan 14,2024 12:05 #dead, #lorry accident, #sisters

కైకలూరు (ఏలూరు) : పండగ వేళ … ఏలూరు జిల్లా మండవల్లి మండలం కానుకొల్లులో విషాదం నెలకొంది. ఇంటిముందు ముగ్గులు వేస్తుండగా.. అక్కాచెల్లెళ్లపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మఅతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. కానుకొల్లు గ్రామానికి చెందిన టిడిపి నేత పంగిళ్ల నాగబాబు కుమార్తెలు రోడ్డు పక్కనే ఉన్న తమ ఇంటి ముందు సంక్రాంతి ముగ్గులు వేస్తున్నారు. అదే సమయంలో గుడివాడ నుంచి కైకలూరు వైపు వెళుతున్న ఇటుకల లారీ వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తేజస్విని (16) మృతి చెందగా, పల్లవీ దుర్గకు (18) గాయాలయ్యాయి. బాధితురాలిని గుడివాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్‌ను ప్రకాశ్‌రావుగా గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. నాగబాబు కుమార్తె మృతితో పెద్ద సంఖ్యలో టిడిపి నాయకులు కానుకొల్లుకు చేరుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. తేజస్విని, పల్లవీ దుర్గ ముదినేపల్లిలోని ఓ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️