నెలలోపు టిడ్కో ఇళ్లు మంజూరు చేయకపోతేగహప్రవేశాలు చేస్తాం : సిపిఎం

ప్రజాశక్తి – కడప అర్బన్‌ అధికా రంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వని కూటమి ప్రభుత్వం, కనీసం టిడ్కో ఇళ్లను మంజూరు చేయా లని సిపిఎం నాయ కులు డిమాండ్‌ చేశారు. మంగ ళవారం నగర శివాలయంలో టిడిపి ప్రభుత్వ హయాంలో ఇండిస్టియల్‌ ఎస్టేట్‌ల నిర్మించిన టిట్కో ఇళ్లను సిపిఎం నాయకుల బందం పరిశీలించింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్‌, జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం టిడ్కో ఇళ్లను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. టిట్కో ఇళ్ల కోసం లబ్ధిదారులు రూ. 25 వేల నుంచి రూ.50 వేలు, లక్ష చొప్పున చెల్లించారని, వాటిని పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందజేయాలని తెలిపారు. ఐదేళ్ల కిందట లబ్ధిదారులతో వేల రూపాయలు వసూలు చేశారని తెలిపారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లబ్ధిదా రులను గుర్తించి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని చెప్పి ఇంతవరకు పేదలకు సెంటు స్థలం ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. టిడ్కో ఇళ్ల పైన జిల్లా ప్రజా ప్రతినిధులు శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని కోరారు. టిట్కో ఇళ్ల స్థలాల కోసం రానున్న కాలంలో సిపిఎం ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు, ఇళ్ల్లు లేని పేదలను సమీకరించి ఆందోళన పోరా టాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి.దస్తగిరి రెడ్డి స్థానిక పార్టీ నాయకులు గోవిందు, నరసింహ, పేదలు పాల్గొన్నారు.

➡️