గాజా : ఇజ్రాయిల్ సైన్యం గాజాతోపాటుగా యెమెన్, లెబనాన్, సిరియాలపై కూడా దాడులకు పాల్పడుతోంది. సోమవారం ఒక్కరోజే యెమెన్, లెబనాన్, సిరియాలపై ఇజ్రాయిల్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో 54 మంది మృతి చెందారు. ఈ క్రమంలోనే ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. దాడుల్ని ఆపేది లేదని.. 20 లక్షల మంది ప్రజలను వేరే ప్రదేశాలకు తరలించే ప్రయత్నంలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
