సమస్యలపై న్యాయవాదుల రాస్తారోకో

May 9,2025 23:54 #lawyers rastharoko
lawyers rastharoko

ప్రజాశక్తి-లీగల్‌ : రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి, రక్షణకు చట్టాలు చేయాలని, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం జిల్లా కోర్టు ప్రధాన ద్వారం వద్ద (ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌) ఐలు ఆధ్వర్యాన రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ, గత ప్రభుత్వం న్యాయవాదులకు లా నేస్తం పేరుతో ప్రతి నెలా రూ.5000 ఇచ్చేదని, ఈ ప్రభుత్వం వచ్చిన పిదప రూ.7000కు పెంచి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఏడాదవుతున్నా అమలు చేయలేదని తెలిపారు. న్యాయ మిత్ర పథకం లబ్ధిదారులకు రూ.3500కు పెంచాలని, రూ.100 కోట్లతో న్యాయవాదుల కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటుచేసి ఆర్థికంగా తోడ్పాటు అందించాలని, ప్రతి న్యాయవాదికీ రూ.5 లక్షల ఆరోగ్య బీమా, రూ.15 లక్షల ప్రమాద బీమాను కల్పించాలని, అర్హులైన న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ప్రత్యేక న్యాయస్థానాలలో రిటైర్డ్‌ న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులను కూడా నియమించే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లతో కరపత్రాలను కోర్టులో పంపిణీచేశారు. కార్యక్రమంలో ఐలు జిల్లా అధ్యక్షులు అల్లు సురేష్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, గౌరవాధ్యక్షులు బివి.రామాంజనేయరావు, ఉపాధ్యక్షులు చేట్ల ఆనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.రాస్తారోకో చేస్తున్న న్యాయవాదులు

➡️