ప్రజాశక్తి – ఏలూరు అర్బన్
కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయిన వారికి నివాళులర్పిస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం సిపిఎం కార్యాలయం నుండి ప్రదర్శనగా బయల్దేరి వసంతమహల్ సెంటర్కు చేరుకుని అక్కడ కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి డిఎన్విడి.ప్రసాద్ మాట్లాడుతూ ఉగ్రదాడిని యావత్ సమాజం ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి.నరసింహారావు, కె.రామాంజనేయులు, వివిఎన్.ప్రసాద్, వైఎస్.కనకారావు, ఎ.శ్యామలారాణి, కె.విజయలక్ష్మి, ఎస్ఎన్.రమేష్, ఎం.ఇస్సాక్, బి.సోమయ్య, పి.రవికుమార్, కోటేశ్వరరావు పాల్గొన్నారు.ఏలూరు బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద కాశ్మీర్లో ఉగ్రదాడిని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం ఏలూరు బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఏలూరు జిల్లా బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కోఆర్డినేషన్ కమిటీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.శ్రీనివాస్ మోహన్, కాళే శ్రీనివాసరావు మాట్లా డారు. కార్య కమంలో కమిటీ జిల్లా కోశాధికారి ఎస్.శ్రీనివాసరావు, బ్యాం కు ఉద్యోగులు పాల్గొన్నారు. ముదినేపల్లి: కాశ్మీర్ ఉగ్రదాడిని నిరసిస్తూ శుక్రవారం ముదినేపల్లి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో మజీద్ కమిటీ సభ్యులు షేక్ బాజీ, మహ్మద్ షరీఫ్, షేక్ నూరుల్లా, ఇమ్రాన్, సులేమాన్, మహ్మద్ రియాజ్ పాల్గొన్నారు. ఏలూరు సిటీ: ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ జనసేన ఆధ్వర్యాన పాత బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్టిసి జోనల్ ఛైర్మన్ రెడ్డి అప్పల నాయుడు, మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, జిల్లా కార్యదర్శి కస్తూరి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. పోలవరం: కాశ్మీర్లో ఉగ్రదాడిని నిరసిస్తూ కూటమి నేతలు స్థానిక ఏటిగట్టు సెంటర్లో మానవహారం నిర్వహించారు. గూటాల అల్ రెహ్మాన్ మసీదు కమిటీ ఆధ్వర్యంలో ముస్లిములు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. గూటాల మసీదు కమిటీ పెద్దలు షేక్ బషీర్, మదీనా, పీర్ భాషా, బాజీ, ఇమ్రాన్, షాజహాన్, ఇర్ఫాన్, ఇస్మాయిల్, అల్తాఫ్, ఖలీల్. కూటమి నాయకులు బొడ్డు కృష్ణ, మంగిన కొండ, జల్లేపల్లి వెంకటనరసింహారావు, కొణతాల ప్రసాద్, గునపర్తి చిన్ని, తెలగంశెట్టి రాంప్రసాద్ పాల్గొన్నారు. నూజివీడు టౌన్: పట్టణంలోని పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జనసేన ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ మాట్లాడారు. నేతలు ఇంటూరి చంటి, ముత్యాల కామేష్ తదితరులు పాల్గొన్నారు. కొయ్యలగూడెం: కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ప్రధాన సెంటర్లో కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మానవహారం నిర్వహించారు. చింతలపూడి: కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ స్థానిక బోసుబొమ్మ సెంటర్లో సిఐటియు, ప్రజాసంఘాల ఆధ్వర్యాన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఆర్విఎస్.నారాయణ, మండల అధ్యక్షులు నత్త వెంకటేశ్వరావు, యుటిఎఫ్ నాయకులు దామోదర్, ప్రేమ్, బుచ్చిబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
