ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని కితలంగి పంచాయతీ దూదుగుడ, కొల్లాపూట్టు పంచాయితీ ఎగువ కొల్లాపుట్టు రోడ్లు అద్వానంగా ఉండడంతో ఆ గ్రామస్తులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దూదుగూడలో మట్టి రోడ్డు గుంతలు గుంతలుగా ఏర్పడటంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కొల్లాపూట్టులో గత మూడేళ్ల క్రితం బిటి రోడ్డు నిర్మాణానికి చిప్స్ రాళ్లు వేసి అసంపూర్తిగా వదిలేయడంతో రవాణాకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అధికారులు స్పందించి రోడ్డు నిర్మించాలని ఆయా గ్రామాల గిరిజనులు కోరుతున్నారు.
