
లక్నో : ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు అదుపు తప్పి చెట్టును ఢకొీట్టడంతో 10 మంది మృతి చెందారు. ఫిలబిత్లోని పురాణ్పూర్ జాతీయ రహదారిపై గజ్రౌలా సమీపంలో గురువారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. ఈ ట్రక్కులో మొత్తం 17 మంది ప్రయాణిస్తుండగా.. 10 మంది చనిపోగా.. ఏడుగురు గాయపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం. గంగానదిలో స్నానం చేసి హరిద్వార్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులకు తీవ్రంగా గాయాలయ్యాయని, వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి ట్రక్కు డ్రైవర్ కారణమని తెలిపారు.