ప్రజాశక్తి-ఆత్మకూరు ప్రతి ఒక్కరూ వారినికోసారం తప్పనిసరిగా డ్రైడే పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వీరబ్బాయి సూచించారు. శుక్రవారం మండలంలోని పంపనూరు గ్రామ తండాను సందర్శించి దోమల నివారణకు చేపట్టిన మలతీయన్ పొడి పిచికారీ, ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఇళ్లలో నీటిని నిల్వ ఉంచుకోరాదన్నారు. వారానికి ఒకసారి డ్రైడే పాటించి లార్వా పెరగకుండా చూసుకోవాలన్నారు. అలాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మలేరియా అధికారి ఓబులు, వైద్యాధికారి దయాకర్, ఉప మలేరియా అధికారి సత్యనారాయణ, మలేరియా ఉప విభాగం సూపర్వైజర్లు, ఎంపిహెచ్ ఇఒ నాగేశ్వరయ్య, మునాఫ్, ఎఎన్ఎం వెంకటలక్ష్మి, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు వెన్నెల, తేజేస్విని, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలతో మాట్లాడుతున్న డిఎంఅండ్హెచ్ఒ వీరబ్బాయి