
'ఆర్ఆర్ఆర్' తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించే సినిమా మరో మూడు నెలల్లోపే పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 20న తారక్ పుట్టిన రోజే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంటుందని సంకేతాలు అందుతున్నాయి. ప్రి ప్రొడక్షన్ వర్క్ పనులు సాగిస్తూనే.. కాస్ట్ అండ్ క్రూ ఎంపికపై దృష్టిసారించాడట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు కథానాయిక, సంగీత దర్శకుడు ఖరారయ్యారు. అలాగే సినిమా విడుదల విషయంలోనూ ఒక నిర్ణయానికి వచ్చేశారు.
తారక్-త్రివిక్రమ్ సినిమాకు రష్మిక మందన్నా కథానాయికగా తమన్ సంగీత దర్శకుడిగా ఓకే అయినట్లు తెలుస్తోంది. వరుసగా త్రివిక్రమ్ మూడో సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని 2022 వేసవిలో విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ముందు 2022 సంక్రాంతినే టార్గెట్ చేశారు కానీ.. అప్పటికి సినిమాను రెడీ చేయడం కష్టం. పైగా ఆ సీజన్కు ఆల్రెడీ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ల సినిమాలు ఖరారయ్యాయి. కాబట్టి వేసవికి ఈ చిత్రాన్ని షెడ్యూల్ చేయనున్నట్లు తెలిసింది.