Sri Lanka: కొండపై నుండి జారిపడిన బస్సు.. 21 మంది మృతి

కొలంబొ : శ్రీలంకలో ప్రయాణికుల బస్సు కొండపై నుండి జారి లోయపడిపోయిన ఘటనలో 21 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. మధ్య శ్రీలంకలో బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పడింది. రాజధాని కొలంబోకు తూర్పున 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొట్మలే పట్టణానికి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. తేయాకు తోటలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో కొండపై నుండి బస్సు జారిపడినట్లు వెల్లడించారు. డ్రైవర్‌ సహా పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని, వారిని స్థానిక ఆస్పత్రికి తరలించామని అన్నారు. ఈ బస్సును ప్రభుత్వ ఆధీనంలోని ట్రావెల్‌ కంపెనీ నడుపుతోందని అన్నారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

➡️