మేము జోక్యం చేసుకోం : అమెరికా ఉపాధ్యక్షులు

న్యూయార్క్‌ : భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న తరుణంలో ఆ విషయంలో తాము జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని అమెరికా పేర్కొంది. ప్రాథమికంగా అది తమ పని కాదని వ్యాఖ్యానించింది. గురువారం ఒక టివి ఇంటర్వ్యూలో అమెరికా ఉపాధ్యక్షులు జెడి వాన్స్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. భారత్‌, పాకిస్తాన్‌లను అమెరికా నియంత్రించలేదన్నారు. అయితే ఆ రెండు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకునేలా తాము ప్రోత్సహించగలమని చెప్పుకొచ్చారు. అణ్వాయుధ దేశాలు ఎప్పుడైనా ఢ కొంటే, ప్రధాన ఘర్షణగా మారితే తాము కూడా ఆందోళన చెందుతామని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారాలని అమెరికా కోరుకుంటోందని, ఈ మేరకు అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌, విదేశాంగ మంత్రి మార్క్‌ రూబియో చేసిన ప్రకటనలను వాన్స్‌ ఉదహరించారు. దౌత్యపరమైన మార్గాల ద్వారా ఈ ప్రయత్నం చేయాలని ఆయన కోరారు.

➡️