బ్రెజిల్‌లో బ్రిక్స్‌ సమావేశాలు

Apr 29,2025 13:29 #Brazil, #BRICS

బ్రసిలియా : బ్రిక్స్‌ విదేశాంగ మంత్రుల సమావేశం బ్రెజిల్‌లో జరగనున్నాయి. ఈ సమావేశాలు బ్రెజిల్‌లో రియో డి జనరీలో నగరంలో సోమవారం, మంగళవారం రెండురోజుపాటు జరగనున్నాయి. మొదట బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు స్థాపించిన ఈ బ్రిక్స్‌ సమూహంలో ఇప్పుడు ఈజిప్టు, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఇథియోపియా, ఇరాన్‌, ఇండోనేషియా, సౌదీ అరేబియాలు కూడా చేరాయి. ప్రస్తుతం బ్రెజిల్‌లో జరుగుతున్న సమావేశానికి చైనా, ఇథియోపియా, ఇండోనేషియా, రష్యా, దక్షిణాఫ్రికా దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఇతర దేశాల నుంచి దౌత్యస్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయడం, గ్లోబల్‌ సౌత్‌ దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సంస్కరించడం వంటి విషయాలపై చర్చించనున్నారు. అలాగే డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాలపై బ్రిక్స్‌ విదేశాంగ మంత్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే గాజా, ఉక్రెయిన్‌లలో శాంతిని నెలకొల్పాలని బ్రిక్స్‌ పిలుపునిచ్చింది.

 

➡️