‘శాంతియుత మార్గాలతో సమస్యలను పరిష్కరించుకోవాలి’ : చైనా

May 10,2025 13:08 #China, #peaceful means, #problems, #resolved

చైనా : ” శాంతియుత మార్గాలతో సమస్యలను పరిష్కరించుకోవాలి ” అని చైనా మరోసారి పిలుపునిచ్చింది. భారత్‌ – పాక్‌ ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో …. ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వం కోసం అంతర్జాతీయంగా పలు దేశాలు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో … గత శుక్రవారం చైనా స్పందిస్తూ … ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. మరోసారి చైనా విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ” భారత్‌- పాక్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం. శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాలు సమయమనం పాటించాలని కోరుతున్నాం. శాంతియుత మార్గాలతో సమస్యలను పరిష్కరించుకోవాలి. ఉద్రిక్తతలను తీవ్రతరం చేసే చర్యలను తగ్గించుకోవాలని సూచిస్తున్నాం. ఈ ఉద్రిక్తతలను తగ్గించాలని అంతర్జాతీయ సమాజం కూడా ఆశిస్తోంది. ఈ సమస్య ముగింపునకు అవసరమైతే నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం ” అని బీజింగ్‌ పేర్కొంది.

➡️